Fire in EV Showroom: చార్జింగ్ పెట్టిన బైక్‌ పేలి భారీ అగ్నిప్రమాదం, కాలిబూడిదైన 90 ఎలక్ట్రిక్ బైక్స్, శ్రీకాకుళంలో ఘోర అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌లకు చార్జింగ్‌ పెట్టారు. అయితే ఓ బైక్‌ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. క్రమంగా అవికాస్తా పెద్దవికావడంతో షారూం మొత్తం మంటలు వ్యాపించాయి.

Fire in EV Showroom: చార్జింగ్ పెట్టిన బైక్‌ పేలి భారీ అగ్నిప్రమాదం, కాలిబూడిదైన 90 ఎలక్ట్రిక్ బైక్స్, శ్రీకాకుళంలో ఘోర   అగ్నిప్రమాదం
Fire (Representational image) Photo Credits: Flickr)

Srikakulam, April 19:  ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌లకు చార్జింగ్‌ పెట్టారు. అయితే ఓ బైక్‌ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు (Fire accident) అంటున్నాయి.  క్రమంగా అవికాస్తా పెద్దవికావడంతో షారూం మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న హార్డ్‌వేర్‌ షాప్‌, వైన్‌ షాప్‌లకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా భారీగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు.

IPL 2023 :ఉప్పల్ స్టేడియంలో తాగుబోతుల హంగామా.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ 

షోరూంలో ఉన్న 90 బైకులు అగ్నికి ఆహుతయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఎలక్ట్రిక్ బైక్స్ షోరూముల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చార్జింగ్ బైకులు పేలడంతో సికింద్రాబాద్‌ లోని ఓ హోటల్‌ లో ప్రాణనష్టం జరిగింది. అయినప్పటికీ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

(The above story first appeared on LatestLY on Apr 19, 2023 09:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).