Andhra Pradesh Elections 2024: వాలంటీర్లపై వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్, తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించిన ఎన్నికల సంఘం
వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు చెప్పాలని తెలిపారు. ఇందులో ఎన్నికల కమిషనర్ పేరుతో ఓ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కు వలంటీర్లపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అయితే వాలంటీర్లపై వైరలవుతున్న ప్రకటన ఫేక్ అని ఎన్నికల సంఘం పేర్కొంది. తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించింది.
దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం(మార్చి 17) నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6 వరకు మొత్తం 80 రోజుల పాటు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్న గ్రామ వలంటీర్లు ఎవరైనా కనిపిస్తే ఎన్నికల సంఘానికి వాట్సాప్ చేయాలంటూ ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..
వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు చెప్పాలని తెలిపారు. ఇందులో ఎన్నికల కమిషనర్ పేరుతో ఓ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కు వలంటీర్లపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అయితే వాలంటీర్లపై వైరలవుతున్న ప్రకటన ఫేక్ అని ఎన్నికల సంఘం పేర్కొంది. తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ సీఈవో పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, 9676692888 సీఈఓ వాట్సాప్గా వైరల్ అవుతున్న నెంబర్ ఫేక్ అని స్పష్టం చేసింది.
Here's EC Tweet
FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024
ఏపీలో పలు చోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘణ జరుగుతుందంటూ, గ్రామ వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంటూ ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. దాంతో ప్రభుత్వ అధికారులు, గ్రామ వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది.
(The above story first appeared on LatestLY on Mar 21, 2024 03:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

