Governor Harichandan Health Update: ఏపీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత, ఊపిరితిత్తుల సమస్యలతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన బిశ్వభూషన్ హరిచందన్, న్యూఢిల్లీ పర్యటన తరువాత దగ్గు, జలుబుతో బాధపడుతున్న హరిచందన్

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ (Vishwa Bhushan) హరిచందన్‌ తీవ్ర అస్వస్థతకు (Governor Harichandan Health Update) గురయ్యారు. బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.

Governor Harichandan Health Update: ఏపీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత, ఊపిరితిత్తుల సమస్యలతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన బిశ్వభూషన్ హరిచందన్, న్యూఢిల్లీ పర్యటన తరువాత దగ్గు, జలుబుతో బాధపడుతున్న హరిచందన్
AP Governor Biswabhusan Harichandan (Photo-PTI)

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ (Vishwa Bhushan) హరిచందన్‌ తీవ్ర అస్వస్థతకు (Governor Harichandan Health Update) గురయ్యారు. బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గవర్నర్ సతీమణి సుప్రవ హరిచందన్, కుమారుడు పృథ్వీ రాజ్ హరిచందన్ ఆయన వెంట ఉన్నారు. ఆయన (Andhra Pradesh Governor Biswabhusan Harichandan) ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.

ఏపీ గ‌వ‌ర్న‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆకాంక్షించారు. విశ్వ భూష‌ణ్ త్వ‌ర‌గా కోలుకుని దేశానికి సేవ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. రాజ్ భవన్ వర్గాల ప్రకారం, అతనికి కోవిడ్ -19 నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని hindustantimes నివేదించింది. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన గత రెండు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారని రాజ్‌భవన్‌ బులెటిన్‌లో పేర్కొంది.

చిన్నారులపై లైంగిక దాడుల విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులపై గ్రామస్తులు దాడి, విచారణ కొనసాగుతుండగానే ఇంటికి తాళంవేసి కర్రలతో అటాక్

హరిచందన్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి తరలించారు, అక్కడ అతన్ని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చేర్చారు. ప్రస్తుతం "డాక్టర్లు ఆయన్ని పరీక్షిస్తున్నారు. అనంతరం ఆసుపత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేయనుంది, ”అని అధికారి తెలిపారు.

Here's Dr Tamilisai Soundararajan Tweet

ఒడిశాకు చెందిన ప్రముఖ నాయకుడైన హరిచందన్ చిలికా, భువనేశ్వర్ (సెంట్రల్) అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో భారతీయ జనతా పార్టీ (బిజెపి), బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు.

(The above story first appeared on LatestLY on Nov 17, 2021 02:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).