New Schedule for AP Tenth Exams: ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త తేదీలు ఇవే! పదోతరగతి పరీక్షల షెడ్యూల్ మార్చుతూ నిర్ణయం, జేఈఈ మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్ కారణంగా తేదీలను మార్చిన విద్యాశాఖ

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు (Tenth Class) అలర్ట్. టెన్త్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు కొత్త షెడ్యూల్ (new schedule) విడుదల చేశారు. పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. పాఠశాల విద్యాశాఖ కొత్త పరీక్షా తేదీలను వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

New Schedule for AP Tenth Exams: ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త తేదీలు ఇవే!  పదోతరగతి పరీక్షల షెడ్యూల్ మార్చుతూ నిర్ణయం, జేఈఈ మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్ కారణంగా తేదీలను మార్చిన విద్యాశాఖ
CBSE 12th Board Exams Cancelled

Vijayawada, March 18: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు (Tenth Class) అలర్ట్. టెన్త్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు కొత్త షెడ్యూల్ (new schedule) విడుదల చేశారు. పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. పాఠశాల విద్యాశాఖ కొత్త పరీక్షా తేదీలను వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలను (Inter Exams) మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.

కొత్త పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఏప్రిల్‌ 27న తెలుగు

ఏప్రిల్‌ 28న సెకండ్‌ లాంగ్వేజ్‌

ఏప్రిల్‌ 29న ఇంగ్లీష్‌

మే 2న గణితం

మే 4న సైన్స్‌ పేపర్‌-1

మే 5న సైన్స్‌ పేపర్‌-2

మే 6న సాంఘిక శాస్త్రం

Hyderabad Road Accident: జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం, రెండు నెలల పసికందు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురిక తీవ్రగాయాలు, స్పందించిన ఎమ్మెల్యే

ఇంటర్‌ పరీక్షల (Inter Exams) షెడ్యూల్‌ లో కూడా మార్పు చేశారు. మారిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ పరీక్షలు మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయి. మే 7 నుంచి మే 24వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరుగతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

AP Health Commissioner New Orders: ఇక గంట గంటకూ సెల్ఫీ దిగాల్సిందే! ఏపీలో డాక్టర్లకు కొత్త రూల్, ప్రతీ గంటలకు వెబ్‌ సైట్‌లో సెల్ఫీ అప్ లోడ్ చేయాలంటూ నిబంధన విధించిన హెల్త్ కమిషనర్

జేఈఈ మెయిన్స్ (JEE Mains) రీ షెడ్యూల్ కారణంగా పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఒకేసారి ఇంటర్‌, పది పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలకు పోలీసు బందోబస్తు, ఆరోగ్య సిబ్బంది, పరీక్ష కేంద్రాలు, ఇతరత్ర సమస్యలు ఏర్పడతాయని అధికారులు గుర్తించారు. కాగా, మొదటిసారిగా పదో తరగతి విద్యార్థులకు ఏడు పరీక్షలే నిర్వహిస్తున్నందున పరీక్ష, పరీక్షకు మధ్య ఒకటి, రెండు రోజులు విరామం ఇచ్చారు.

(The above story first appeared on LatestLY on Mar 18, 2022 09:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).