YS jagan Mohan Reddy (Photo-YSRCP/X)

Vjy, Feb 13: బుధవా­రం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమా­వేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్య­కర్త తరపున చంద్రబాబుకు చెబు­తున్నా... మళ్లీ వచ్చేది జగన్‌ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం. కార్యకర్త­లకు అన్నలా ఉంటా..’ అని వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) భరోసాని­చ్చారు.

జగన్‌ 1.0 పాలనలో అధికారంలోకి వచ్చిన 9 నెలలు కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్‌ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం. తర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్‌ మధ్యే ఉన్నాం. ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడు­గులు వేశాం. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేక­పో­యాం. ఈసారి జగన్‌ 2.0లో ప్రజ­లకు తోడుగా ఉంటూ.. కార్యకర్తలకు అండగా, వారి ఇంటికి అన్నలా ఉంటా. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది.

చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు...ముందస్తు బెయిల్ ఉన్న అరెస్ట్ చేస్తారా?, వైసీపీ నేతలు ఫైర్

తమ వాళ్లను పదవుల్లో కూర్చోబెట్టడా­నికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగదీసుకోవ­డానికి, ప్రలోభపెట్టడానికి ప్రయ­త్ని­స్తారు. ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఎల్లకాలం ఇలా ఉండదు. చీకటి తర్వాత వెలుతురు రాక మానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్‌ను కాపాడుకుందాం. మన విలువలు కాపాడు­కుందాం. ఆ తర్వాత రాబోయే మన ప్రభు­త్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని జగన్ అన్నారు.