COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభన, గత 24 గంటల్లో కొత్తగా మరో 10,175 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5 లక్షల 37 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య
COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, September 10: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత ఒక స్థాయిలో స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 10,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 5,37,687కు చేరింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 5,34,792 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది, గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1412 కేసులు నమోదయ్యాయి.

అలాగే పశ్చిమ గోదావరి మరియు ప్రకాశం జిల్లాల నుంచి కూడా వెయ్యికి పైబడి పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 68 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 4,702కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,040 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 4,35,647 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 97,338 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  72,229 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు రాష్ట్రంలో  43,80,991 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.