Corona in AP: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా తొమ్మిదో రోజూ 10 వేలు దాటిన పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 4 లక్షల 76 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4276కు పెరిగిన కరోనా మరణాలు
Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

Amaravati, September 4:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత ఒక స్థాయిలో పెరుగుతూపోతుంది. లేదు. రాష్ట్రంలో వరుసగా 9వ రోజు 10 వేలకు పైబడి కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.  గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,776  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,76,506కు చేరింది.  అయితే  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,73,611 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఎప్పట్లాగే తూర్పు గోదావరి జిల్లాలోనే కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ జిల్లాలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయో అధికారులు దృష్టి పెట్టి అందుకు తగినట్లుగా నియంత్రణ చర్యలు చేపట్టడం ఎంతో అవసరం.  గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1405 కేసులు నమోదయ్యాయి.

అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా కొత్తగా 1200 పాజిటివ్ కేసులు పైబడి నమోదవడం గమనార్హం. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 76 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 4,276కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 12,334 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 3,70,163 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,02,067 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  59,919 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు రాష్ట్రంలో  39,65,694 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా, రాష్ట్రంలో #COVID19 నివారణ చర్యలపై ఈరోజు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్.జగన్‌ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సహా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్య,ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.