Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

 Amaravati. November 9: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది, అయితే కొత్తగా వచ్చే కేసుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్య ఇంచుమించు సమానంగానే ఉంటుండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన మార్పు ఉండటం లేదు.  గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  61,050మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 1,392 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,44,359కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,41,464గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు  తూర్పు గోదావరి జిల్లా నుంచి 341, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 243 కేసులు రాగా,  కడప, గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల నుంచి వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6802కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1549 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,13,427 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 21,235 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.