COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, October 29:   ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి మెల్లిమెల్లిగా అదుపులోకి వస్తోంది, ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరోవైపు రికవరీలు పెరుగుతుండటంతో మళ్లీ సాధారణ పరిస్థితులపై ఆశలు చిగురిస్తున్నాయి. అయినప్పటికీ వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  88,778 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 2,905 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,17,679కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,14,784గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు  పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 494,  తూర్పు గోదావరి జిల్లా నుంచి 414, కృష్ణా నుంచి  361  మరియు గుంటూరు జిల్లా నుంచి 358  కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 16 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6659కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,243 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 7,84,752 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 26,268 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.