COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన మహమ్మారి,  కొత్తగా మరో 538 మందికి కొవిడ్ పాజిటివ్, మరో 558 మంది రికవరీ, రాష్ట్రంలో 5237కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, December 10: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. గతంలో భయంకరంగా వచ్చే కేసులు ఇప్పుడు చాలా తగ్గాయి, మరణాల సంఖ్యలో కూడా గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. మరోవైపు కోలుకునే వారి సంఖ్య  మెరుగ్గా ఉండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  64,354 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 538 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య  8,71,100కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,73,995గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 95,  కృష్ణా జిల్లా నుంచి 86,  గుంటూరు నుంచి 72, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 72, 50   కొత్త కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో మరో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7047కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 558 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,61,711 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 5,237 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.