Amaravati, October 8: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్తగా నమోదయ్యే కేసుల కంటే కూడా కోలుకునే వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఆనందించదగ్గ విషయం. అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకుండా వైరస్ పూర్తిగా అంతం అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
గత 24 గంటల్లో ఏపిలో నమోదైన కేసుల విషయానికి వస్తే 66,944 మంది శాంపుల్స్ పరీక్షించగా రాష్ట్రవ్యాప్తంగా మరో 5,292 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,39,719కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,36,824 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
జిల్లాల్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. అయితే గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 784 కేసులు నమోదయ్యాయి. ఇక తూర్పు గోదావరి నుంచి 652, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 612 పాజిటివ్ కేసులు, మరియు ప్రకాశం జిల్లా నుంచి 591 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 42 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6,128 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 6,102 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 6,84,930 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 48,661 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.