AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 618 మందికి పాజిటివ్, మరో 785 మంది రికవరీ, రాష్ట్రంలో 5259గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus Outbreak in AP | Photo: IANS

Hyderabad, December 9: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నప్పటికీ,  కొత్త కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  61,038 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య  8,73,457కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,70,562గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా  కృష్ణా జిల్లా నుంచి 121,  గుంటూరు నుంచి 92, చిత్తూరు నుంచి 76  కొత్త కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో మరో 3 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7045కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 785 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,61,153 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 5,259 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.