
Amaravati, August 1: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకు పెరుగుతూ పోతున్న పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర, తమిళనాడుల తర్వాత ఏపీ దేశంలోనే మూడో స్థానంలో కొనసాగుతుంది.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 9,276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,50,209 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 1,47,314 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు నుంచి అత్యధికంగా 1234 కేసులు, విశాఖపట్నం నుంచి 1155 మరియు గుంటూరు నుంచి 1001 కేసుల చొప్పున నమోదయ్యాయి.
గడిచిన ఒక్కరోజులో మరో 58 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 1407 కు పెరిగింది.
AP's COVID19 Report:

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు అత్యధికంగా 12,750 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 76,614 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 72,188 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
గడిచిన ఒక్కరోజులో భారీ స్థాయిలో 60,797 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు 20,12,573 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.