COVID19 in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మరో 3892 మందికి పాజిటివ్, మరో 5050 మంది రికవరీ, రాష్ట్రంలో 41,669గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, October 14:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా, కొవిడ్ నుంచి కోలుకునే వారి సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది, రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 7.67 లక్షలు దాటినా, ఆక్టివ్ కేసులు 41 వేలలోనే ఉండటం ఊరట కలిగించే విషయం.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  69,463 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 3,892 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,67,465కు చేరింది.

అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,64,570 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 607, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 518, కృష్ణా జిల్లా నుంచి 458 మరియు చిత్తూరు జిల్లా నుంచి 405 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 28 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6319కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 5,050 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 7,19,477 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 41,669 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.