
Amaravati, October 5: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. పడుతున్నాయి. ఒకటి, రెండు జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. మరోవైపు కోలుకునే వారి సంఖ్య మెరుగ్గా ఉంటుంది.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 4,256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,23,512కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,20,617 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత గతంలో కంటే తగ్గినప్పటికీ కొత్తగా నమోదయ్యే కేసులు ఎక్కువగా ఇక్కడి నుంచే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 853 కేసులు నమోదయ్యాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 513 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అలాగే ప్రకాశం జిల్లా నుంచి 666 మరియు గుంటూరు నుంచి 444 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 38 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6019కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,558 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 6,66,433 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 51,060 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
గడిచిన ఒక్కరోజులో 56, 145 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు రాష్ట్రంలో 61,50,351 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.