
Amaravati, October 6: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కేసుల సంఖ్య ఒకరోజు తగ్గుతోంది, మరోరోజు పెరుగుతోంది. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం నిన్నటికంటే ఈరోజు సుమారు వెయ్యి కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసులు 7.29 లక్షలకు పైగానే ఉన్నప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం 50 వేలలో ఉంది. ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసులు వేలల్లోనే ఉంటున్నప్పటికీ అదే స్థాయిలో రికవరీలు కూడా ఉండటం మూలానా, యాక్టివ్ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది.
గత 24 గంటల్లో ఏపిలో నమోదైన కేసుల విషయానికి వస్తే 65,889 మంది శాంపుల్స్ పరీక్షించగా రాష్ట్రవ్యాప్తంగా మరో 5,795 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,29,307కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,26,412 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 970 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి నుంచి 801, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 696 పాజిటివ్ కేసులు, మరియు ప్రకాశం జిల్లా నుంచి 580 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 33 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6,052 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 6,046 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 6,72,479 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 50,776 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.