Andhra Pradesh Shocker: భర్త వేరు కాపురానికి రావడం లేదని కక్ష, నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, పరారీలో భార్య
Crime | Representational Image (Photo Credits: Pixabay)

Annamayya district, June 9: బుధవారం తెల్లవారుజామున 34 ఏళ్ల మహిళ తన భర్త నిద్రిస్తున్న సమయంలో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పూజారివాండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు శ్రీధర్ (36)ను మాజీ సైనికుడిగా పేర్కొన్నారు.మదనపల్లె డిఎస్పి కె కేశప్ప ప్రకారం, శ్రీధర్ భారత సైన్యంలో తన కాలం పనిచేసిన తరువాత సుమారు సంవత్సరం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. వివాహం చేసుకుని ఇంటివద్డ ఉంటున్నాడు.

అయితే శ్రీధర్ తిరిగి వచ్చినప్పటి నుండి, మమత తన భర్తను అతని తల్లిదండ్రుల నుండి విడిగా జీవించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం, ఈ ఆలోచనను శ్రీధర్ ఎప్పుడూ తిరస్కరించాడు.ఈ గొడవ ముదిరింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శ్రీధర్ మద్యం మత్తులో ఇంటికి వెళ్లి, భార్యతో గొడవ పడి నిద్రకు ఉపక్రమించాడు.

మొబైల్ ఇస్తామంటూ రూంకి పిలిచి దారుణంగా అత్యాచారం, నొప్పి అంటూ అరుస్తున్నా నోరు మూసి పని కానిచ్చిన కామాంధులు

ఇదే అదనుగా భావించిన భార్య మమత నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. బాధితుడి రోదనలు విన్న ఇరుగుపొరుగు వారు సాయం అందించారు.వెంటనే బెంగళూరులోని ఆసుపత్రికి తరలించగా, శ్రీధర్ గురువారం మరణించాడు. ముదివేడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఘటన తర్వాత మమత అక్కడి నుంచి పారిపోయింది, పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు.

ముంబైలో దారుణం, మద్యం మత్తులో ఉన్న మగ ప్రయాణికుడిపై ఆటోడ్రైవర్ అత్యాచారం, ఛార్జీ డబ్బులు ఇవ్వలేదని పొదల్లోకి లాక్కెళ్లి మరీ దారుణం

వారం రోజుల క్రితం తెలంగాణలో జరిగిన ఓ ప్రత్యేక ఘటనలో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తపై డీజిల్ పోసి నిప్పంటించింది. నిందితుడిని 30 ఏళ్ల యాదమ్మగా గుర్తించారు. బాధితుడు 35 ఏళ్ల సుంకు నరసింహులు 90% కాలిన గాయాలతో వైద్య సంరక్షణ కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపబడ్డాడు. కుటుంబ కలహాలే హత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది.