Kisan Train: అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు. జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రులు తోమర్, సురేష్, అక్టోబరు నుంచి ప్రతి రోజూ ఢిల్లీకి కిసాన్ రైలు
ఏపీలో అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్, ఏపి సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైన్ను జెండా ఊపి (AP CM YS Jagan flags of Kisan train) ప్రారంభించారు. అనంతరం కిసాన్ రైలు అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది.
Amaravati, Sep 9: ఏపీలో అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్, ఏపి సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైన్ను జెండా ఊపి (AP CM YS Jagan flags of Kisan train) ప్రారంభించారు. అనంతరం కిసాన్ రైలు అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. మహారాష్ట్ర నుంచి బిహార్కు వెళ్లే దేశంలోనే తొలి కిసాన్ రైలు (Kisan Train) గత నెలలో ప్రారంభమైంది. నాసిక్ జిల్లా దియోలలి నుంచి బిహార్లోని దనాపూర్కు కిసాన్ రైలును ఆగస్టులో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు.
ఇది రెండో రైలు. అక్టోబర్ నుంచి రైలును పూర్తిస్థాయిలో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో రైతులు పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు (horticulture products) రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బుధవారం ఢిల్లీకి ప్రత్యేకంగా ‘కిసాన్ రైలు’ ప్రారంభించారు. అనంతపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లే కిసాన్ రైలు అక్టోబరు నుంచి ప్రతి రోజూ నడుస్తుంది.
AP CMO Tweet
అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభోత్సవం. తాడేపల్లి నుంచి, ఢిల్లీ నుంచి జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, కేంద్రమంత్రులు.
ఢిల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ pic.twitter.com/Mb4niSoWOc
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 9, 2020
కిసాన్ రైలు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ సీఎం వైయస్ జగన్ తెలిపారు. అనంతపురంలో పండే పళ్లకు ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో మంచి పేరుంది. అనంతపురం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాలకు కూడా పండ్లు ఎగుమతి అవుతున్నాయి. అనంత నుంచి హస్తినకు వెళ్తున్న తొలి కిసాన్ రైల్లో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్ కోచ్ బోగీ ఒకటి ఏర్పాటు చేశారు.
కిసాన్ రైలు సేవల ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డు మార్గంతో పోల్చుకుంటే ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది. అంతేకాదు రాష్ట్రం బయట పంటను అమ్ముకుంటే మంచి ధర లభిస్తుంది. తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఏపీ సీఎం తెలిపారు.
(The above story first appeared on LatestLY on Sep 09, 2020 03:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

