Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Amaravati, November 2:  ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు ఒకరోజు ఎక్కువగా, మరొక రోజు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే కోలుకునే వారి సంఖ్యలో స్థిరమైన తగ్గుదల కనిపిస్తుంది. ఏది ఏమైనా పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డిసెబంర్ నాటికి సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశాలు కొట్టిపాడేయలమని ఆరోగ్య నిపుణులు అంచనావేస్తున్నారు.

ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  64,581 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 1916 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,27,882కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,24,987 గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు  పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 426,  తూర్పు గోదావరి జిల్లా నుంచి 354 కేసులు రాగా, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు, కడప, ప్రకాశం మరియు విశాఖపట్నం జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నమోదు చేయబడ్డాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 13 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6719కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,033 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 7,98,625 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 22,538 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.