AP Government logo (Photo-Wikimedia Commons)

వయసు మీరిన నిరుద్యో­గులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజె­న్సీలు నేరుగా భర్తీ చేసే నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.

వై ఏపీ నీడ్స్‌ జగన్‌, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపు, ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు

నాన్‌ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో­పరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.