
Amaravati, November 7: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది, ప్రతిరోజు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి, రికవరీలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,082 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 2,367 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,40,730కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,37,835 గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 386, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 361 మరియు కృష్ణా జిల్లా నుంచి 358 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6779కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 2747 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,12,517 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 21,434 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.