UTS System in APSRTC: ఇకపై యూపీఐ ద్వారా కూడా ఆర్టీసీ బస్సు టికెట్ కొనొచ్చు, సరికొత్త యాప్‌పై దృష్టి పెట్టిన ఏపీఎస్‌ఆర్టీసీ, బస్సుల్లో ఇకపై పేపర్‌లెస్ టికెటింగ్‌పై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ (APSRTC) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్‌ రహిత సేవలను అందించాలని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నిర్ణయించింది. యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (UTS) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు.

UTS System in APSRTC: ఇకపై యూపీఐ ద్వారా కూడా ఆర్టీసీ బస్సు టికెట్ కొనొచ్చు, సరికొత్త యాప్‌పై దృష్టి పెట్టిన ఏపీఎస్‌ఆర్టీసీ, బస్సుల్లో ఇకపై పేపర్‌లెస్ టికెటింగ్‌పై ప్రత్యేక దృష్టి
APSRTC Bus. (Photo Credits: PTI | Representative Image)

Vijayawada, SEP 01: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ (APSRTC) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్‌ రహిత సేవలను అందించాలని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నిర్ణయించింది. యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (UTS) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీ సేవలన్నింటినీ ఒకే యాప్‌ కిందకు తెచ్చేందుకు అధికారులను నిర్ణయించారు. ఈ యాప్‌తో అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే బస్‌ టికెట్‌ బుకింగ్‌తోపాటు బస్సుల రాకపోకలు, గూడ్స్‌ రవాణా వంటి విషయాలను తెలుసుకునే వీలుంటుందని అధికారులు అంటున్నారు.

CM Jagan YSR Kadapa Tour: వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీఎం జగన్, కాంప్లెక్స్ ద్వారా అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు ఒకే ప్రాంగణంలోకి 

ఇప్పటి వరకు బస్సుల్లో నగదు ద్వారానే టికెట్లు ఇస్తుండగా.. ఇకపై డెబిట్‌ కార్డు (Debit card), క్రెడిట్‌ కార్టు (Credit card), వాలెట్లు (Wallet), యూపీఐ  (UPI) ద్వారా చెల్లింపులు జరుపవచ్చని అధికారులు పేర్కొన్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో (QR Code Scaning) కూడా టికెట్లు పొందే వీలుందని.. రానున్న రోజుల్లో పేపర్‌ టికెట్‌ నామమాత్రం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

CM Jagan Kadapa Tour Schedule: సీఎం జగన్ మూడు రోజుల కడప షెడ్యూల్ ఇదే, వైఎస్సార్‌ జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీవరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి 

బస్సులో ప్రయాణిస్తూనే మరో స్టేజి నుంచి వేరే బస్సులో వెళ్లేందుకు కూడా టికెట్‌ తీసుకునే వీలు కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్‌ రహిత సేవలను అందించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది.

(The above story first appeared on LatestLY on Sep 01, 2022 11:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).