APSRTC: కర్ణాటకకు ఏపీ బస్సులు నిలిపివేత, బెంగుళూరులో పూర్తి లాక్‌డౌన్ అమలు, జూలై 15 నుండి 23 వరకు అన్ని బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం
APSRTC to stops all 168 services to Karnataka from tomorrow amid Bengaluru going under complete lockdown (Photo-ANI)

Amaravati, July 14: కర్ణాటకలో కోవిడ్ -19 కేసులు( COVID-19) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో పూర్తి లాక్డౌన్ (Bengaluru lockdown) విధించారు. ఈ నేపథ్యంలో బెంగుళూరుకు బస్సు సేవలను జూలై 15 నుండి 23 వరకు నిలిపివేయాలని (APSRTC to stops all 168 services to Karnataka) ఎపి స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) నిర్ణయించింది. కాగా జూన్ 17 నుండి ఏపీఎస్ఆర్టీసీ కర్ణాటకకు 168 బస్సులను నడుపుతోంది. ఏపీలో విస్తారంగా వర్షాలు, మరో రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు కురిసే అవకాశం, కళకళలాడుతున్న ప్రాజెక్టులు

కోవిడ్ -19 కేసులు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో కూడా బస్సు సేవలను రద్దు చేయడానికి కూడా ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. బెంగళూరులో తిరిగి లాక్డౌన్ విధించడం గురించి ఆర్టీసీ అధికారులు తమ కర్ణాటక నుండి అధికారిక సమాచారం అందుకున్న తరువాత బుధవారం నుండి కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటకలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఈడీ తెలిపారు. టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేయనున్నారు. ఈ నెల 14 నుంచి బెంగళూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నెల 23 వరకు పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారికి మాత్రమే రోడ్లపైకి అనుమతి ఇస్తారు.  ఒక్కరోజే కరోనాతో 37 మంది మృతి, గత 24 గంటల్లో 1935 కోవిడ్-19 కేసులు, రాష్ట్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌

ఏపీ వైపు సర్వీసులను ఆపేస్తున్నట్లు ఇప్పటికే కర్ణాటక ప్రకటించింది.. అంతేకాదు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. బెంగళూరు నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక కూడా ఏపీకి బస్సులు నిలిపివేసింది.

ఏపీలో, కర్ణాటకలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత జూన్ 17న 168 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. అనంతపూర్ (60), చిత్తూరు (30), కర్నూలు (20), నెల్లూరు (16), కడప (12), విజయవాడ (10), ప్రకాశం (10), గుంటూరు (4), తూర్పు గోదావరి (4), పశ్చిమ గోదావరి (2) బస్సులు ఇప్పటిదాకా నడుస్తున్నాయి. అయితే, అంతర్రాష్ట్ర సేవలు తిరిగి ప్రారంభమైన తరువాత విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు విజయనగరం నుండి బస్సులు నడపలేదు.