![](https://test1.latestly.com/uploads/images/2025/02/1-518881136-1-.jpg?width=380&height=214)
Vjy, Feb 9: తిరుపతి నియోజకవర్గ జనసేన (Jana Sena Party)ఇన్ఛార్జి కిరణ్ రాయల్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి రూ.1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని (Kiran Royal Extortion Case) తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి.. కిరణ్రాయల్పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్.. కైపు.. నైఫ్.. అంటూ లక్ష్మీతో కిరణ్రాయల్ చెప్పడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Kiran Royal Extortion Case:
కేసులు ఉన్నది వాస్తవం... కానీ కేసులకి కారణం కిరణ్ రాయల్ నా ఫోన్ నుంచి చేసిన లావాదేవీలే కారణం: బాధితురాలు లక్ష్మీ pic.twitter.com/nl5BdJLHOD
— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2025
కిరణ్ రాయల్ ఇష్యూపై మరో సారి స్పందించిన బాధితురాలు
చనిపోయి అయిన సరే కిరణ్ రాయల్ తీసుకున్న డబ్బులు నా పిల్లలకు చెందుతాయి అనుకొని వీడియో పోస్ట్ చేశాను.
కిరణ్ రాయల్ చేసిన ఆరోపణలకు నా దగ్గర అన్నీంటికి సాక్ష్యాలు ఉన్నాయి.
- బాధితురాలు లక్ష్మి pic.twitter.com/SYyGLfpDt3
— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2025
ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ కళ్యాణ్ అన్నా.. ఇప్పుడు మీ జనసేన ఇంఛార్జ్ కారణంగా నాకు కష్టం వచ్చింది నాకు అండగా నిలబడవా అన్న!
అమ్మాయిలు, మహిళల జీవితాలతో ఆడుకోవడం తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్కి సరదా.. ఆ మహిళల వద్ద డబ్బులు అయిపోతే సైలెంట్గా… pic.twitter.com/1SDDwq3Zyp
— Telugu Scribe (@TeluguScribe) February 10, 2025
నాకు కిరణ్ రాయల్ నుండి ప్రాణ హాని ఉంది
-బాధిత మహిళ లక్ష్మీ pic.twitter.com/4yWeVYFH8Y
— Nani YCP (@RajNani111) February 10, 2025
తన కుటుంబంపై కిరణ్ రాయల్ బెదిరింపులకు దిగుతున్నారంటూ బాధితురాలు లక్ష్మి పోలీసుల్ని ఆశ్రయించారు. తన ఇద్దరు కుమారుల్ని చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నారని లక్ష్మి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కిరణ్ ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు ఇప్పించాలని ఫిర్యాదులో కోరింది. pic.twitter.com/SfRejvn7hk
— Sakshi TV (@SakshiHDTV) February 10, 2025
అయితే ఈ వీడియో బయటకు రావడంతో నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా.. నాలుగు రోజుల్లో బెయిల్పై బయటకొస్తా.. నీ వల్ల ఏమైతే అది చేసుకో.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నీ కొడుకులు పెద్దవాళ్లయ్యారని విర్రవీగొద్దు.. వాళ్ల కాళ్లు విరిచేస్తా..’ అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన ఆడియో కూడా వెలుగులోకి వచ్చింది.
Kiran Royal Audio Leak
కిరణ్ రాయల్ వైరల్ వీడియో.#kiranroyal pic.twitter.com/4J1Fww42ki
— jagananna kosam (@s_deepakreddy) February 8, 2025
Kiran Royal Private Video Leak
వైఫ్ అంట...కైఫ్ అంట...నైఫ్ అంట 😂😂😂
నీలో మంచి విషయం ఉందిరా కిరణ్ రాయల్ గా
వీడియో మాత్రం HD క్వాలిటీలో ఉందిరా😂😂#PoliticalBrokerPK #Janasena pic.twitter.com/XCfGlxuU5a
— kickjaganhaters (@kickjaganhaters) February 9, 2025
Jana Sena Party launches probe into allegations of extortion against Kiran Royal
గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై వచ్చిన వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో వాటిపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు ఆయనను పార్టీ కార్యక్రమాల నుండి దూరం ఉండవలసిందిగా ఆదేశించిన జనసేన పార్టీ.@JanaSenaParty @KiranRoyaljsp pic.twitter.com/DmDZV58Coz
— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 9, 2025
ఈ నేపథ్యంలో కిరణ్రాయల్ తనతో ప్రైవేటుగా ఉన్న వీడియో క్లిపింగ్ను ఆమె ఆదివారం తెల్లవారు జామున మీడియాకు విడుదల చేసింది. వారిద్దరూ బెడ్పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడియోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్రాయల్ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజాగా కిరణ్ రాయల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తిరుపతి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కిరణ్ రాయల్ మాట్లాడుతూ, వైసీపీ నేతలు బెదిరింపులతో తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలతో దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశానని వివరించారు. ఎప్పుడో పదేళ్ల కిందట సమసిపోయిన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు. దీనిపై కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నానని వెల్లడించారు. తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని వెల్లడించారు.