Prakasam Horror: విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. దొరికిందే చాన్స్ అంటూ వండుకుని తినేసిన దుండగులు.. ప్రకాశం జిల్లాలో దారుణం
పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన విద్యుత్ కంచెకు తగిలి ఓ పులి మరణించింది. దాని కళేబరాన్ని గమనించిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకుని తినేశారు. పులి చర్మాన్ని బావిలో పడేశారు. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Prakasam, Feb 20: పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన విద్యుత్ కంచెకు (Electric Fence) తగిలి ఓ పులి (Tiger) మరణించింది. దాని కళేబరాన్ని గమనించిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకుని (Cooked) తినేశారు. పులి చర్మాన్ని బావిలో పడేశారు. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా (Prakasam) పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. పులి మాంసాన్ని వండుకుని తిన్నట్టుగా భావిస్తున్న 12 మందిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on Feb 20, 2023 08:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

