AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 1728 మందికి పాజిటివ్, మరో 1777 మంది రికవరీ, రాష్ట్రంలో 20,857గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

Amaravati, November 12: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా వచ్చే కేసుల సంఖ్య అలాగే కోలుకుంటున్న వారి సంఖ్య ఇంచుమించు సమానంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఆక్టివ్ కేసుల సంఖ్యలో కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది.  గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  77,148 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 1,728 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య  8,49,705కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,46,810గా ఉంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 290, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 239 కేసులు రాగా,  కృష్ణా జిల్లా నుంచి 223,  గుంటూరు నుంచి 212 మరియు చిత్తూరు జిల్లా నుంచి 206 కొత్త కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 9 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6837కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1777 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,22,011 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 20,857 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.