Ganta Resigns to MLA Post: ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా రాజీనామా
TDP MLA Ganta Srinivasa Rao. (Photo Credits: PTI)

Amaravati, Feb 6: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రాజీనామా (Ganta Resign for MLA Post) చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మె‍ల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన (TDP MLA Ganta Srinivasa Rao) ప్రకటించారు.

స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్‌ శనివారం లేఖ రాశారు.

మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ (Vizag steel plant) ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను చాటిచెప్పారు.

విశాఖలో ఊపందుకున్న ఉద్యమం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పిన ఉద్యోగ, కార్మిక సంఘాలు, మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు

ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Here's Ganta Srinivasa Rao Tweets

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పార్టీ విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. కాగా గంటా టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరతారనే వార్తలు వైరలయ్యాయి. కానీ వివిధ కారణాల వల్ల ఆ దిశగా అడుగులు పడలేదు. బీజేపీలో కూడా ఆయన చేరేందుకు చర్చలు జరుపుతున్నారంటూ వాదనలు తెరపైకి వచ్చాయి. కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు.