Bears at Lord Siva Temple: శివాలయంలోకి ఒకేసారి చొరపడ్డ మూడు ఎలుగుబంట్లు.. భయంతో పరుగెత్తిన జనాలు (వీడియో)
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా.. ఉన్నట్టుండి ఆలయంలోకి ఒకేసారి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి.
Srikakulam, Nov 15: ఏపీలోని (Andhrapradesh) శ్రీకాకుళం జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయంలో (Lord Siva Temple) భక్తులు పూజలు చేస్తుండగా.. ఉన్నట్టుండి ఆలయంలోకి ఒకేసారి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. టెంపుల్ ప్రాంగణం నుంచి లోనికి ఎలుగులు వస్తుండటాన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఎలుగుబంట్లు మాత్రం ఆలయం మొత్తం కలివిడిగా తిరిగినట్లు టెంపుల్ లో ఏర్పాటు చేసి సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.
Here's Video:
శివాలయంలో ఎలుగుబంట్లు హల్చల్
శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురం గ్రామంలో ఒకేసారి మూడు ఎలుగుబంట్లు సంచారం
కార్తీక పౌర్ణమి నేపథ్యంలో శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా నంది విగ్రహం వద్ద ఎలుగుబంట్లు ప్రత్యక్షం
భక్తులను హడలెత్తించిన ఎలుగుబంట్లు
అటవీశాఖ అధికారులు చర్యలు… pic.twitter.com/HDcRZSaRCk
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2024
బయటకు రావాలన్నా భయమే
ఎలుగుల రాకపై గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా, ఎలుగుబంట్ల సంచారంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా గ్రామస్థులు జంకుతున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

