Coronavirus Outbreak Representational Image| (Photo Credits: PTI)

Amaravati, November 11:  ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది, ఇటీవల కాలంగా ప్రతిరోజు ఇంచుమించుగా 15 వందలకు అటుఇటుగా  పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి, రికవరీలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  ఈ క్రమంలో ఆక్టివ్ కేసుల సంఖ్య 21 వేల దిగువకు చేరింది.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  70,405 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో  1732 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,47,977కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,45,082 గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు  తూర్పు గోదావరి జిల్లా నుంచి 344, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 227 మరియు కృష్ణా జిల్లా నుంచి 246, చిత్తూరు నుంచి 198 మరియు గుంటూరు నుంచి 195 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన ఒక్కరోజులో  మరో 14 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6828కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1761  మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,20,234 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 20,915 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.