
Amaravati, October 26: ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. పలు జిల్లాల్లో నిన్న మొన్నటివరకు వందకు తక్కువ కాకుండా వచ్చే కేసులు ఇప్పుడు ఇరవై కంటే తక్కువకు రావటం ఉత్సాహాన్నిచ్చే విషయం. దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8 లక్షలకు పైగానే ఉన్నప్పటికీ , ఆక్టివ్ కేసులు 28 వేలలోనే ఉండటం ఊరట కలిగించే విషయం.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 51,544 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 1901 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 80,89,24కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 80,60,29 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 397, తూర్పు గోదావరి జిల్లా నుంచి 313, గుంటూరు జిల్లా నుంచి 297 మరియు చిత్తూరు జిల్లా నుంచి 289 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 19 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6606కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,972 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 7,73,548 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 28,770 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.