
Amaravati, October 21: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఒకటి, రెండు జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువైనప్పటికీ , ఆక్టివ్ కేసులు 30 వేలలోనే ఉండటం ఊరట కలిగించే విషయం.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 3,746 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,93,299కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,90,404 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 677, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 519, కృష్ణా జిల్లా నుంచి 503 మరియు చిత్తూరు జిల్లా నుంచి 437 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 27 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6508కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 4,739 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 7,51,520 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 32,376 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.