Vallabhaneni Vamsi Mohan Case: నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ హాని ఉందని తెలిపిన వల్లభనేని వంశీ, 14 రోజుల రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు

కోర్టు విచారణలో, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, వీరగంధం రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. విచారణ మొదట్లో తెల్లవారుజామున 1:45 గంటల వరకు కొనసాగింది, కానీ పరిష్కారం కాకపోవడంతో, ఇరువర్గాల వాదనలు వినడానికి న్యాయమూర్తి సెషన్‌ను మరో 30 నిమిషాలు పొడిగించారు

Vallabhaneni Vamsi Mohan Case: నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ హాని ఉందని తెలిపిన వల్లభనేని వంశీ, 14 రోజుల రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు
Vallabhaneni Vamsi Mohan Arrest(Photo/X)

Vjy, Feb 14: కిడ్నాప్, దాడి, బెదిరింపులకు సంబంధించిన కేసులో వైయస్ఆర్సిపి నాయకుడు వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi Mohan Areest) భార్య పంకజ శ్రీ తన భర్త భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌లో విచారణ సందర్భంగా పోలీసులు వంశీ పట్ల దూకుడుగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు.

వంశీ అరెస్టును చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం అని పేర్కొంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె నొక్కి చెప్పారు. తన భర్త తనకు ప్రాణహాని ఉందని (Wife Alleges Threat to His Life) మేజిస్ట్రేట్‌కు తెలియజేశారని కూడా ఆమె పేర్కొంది. కోర్టు విచారణలో, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, వీరగంధం రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. విచారణ మొదట్లో తెల్లవారుజామున 1:45 గంటల వరకు కొనసాగింది, కానీ పరిష్కారం కాకపోవడంతో, ఇరువర్గాల వాదనలు వినడానికి న్యాయమూర్తి సెషన్‌ను మరో 30 నిమిషాలు పొడిగించారు. దీని తరువాత, వంశీతో పాటు సహ నిందితులు శివరామ కృష్ణ, లక్ష్మీపతిలకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ 9Vamsi Remanded for 14 Days) విధించింది.

డీజీపీ అప్పాయింట్‌మెంట్ ఇస్తే వచ్చాం, అయినా కలవకుండా వెళ్లిపోయారు, తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన అంబటి రాంబాబు

ఇక పోలీసుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ‘నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అరెస్ట్‌ విషయంలో పూర్తిగా సహకరించినా నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నాకు వైద్య సహాయం అందకుండా పోలీసులు ప్రతీక్షణం అడ్డుకున్నారు. అరెస్ట్‌ నుంచి కోర్టుకు తరలించే వరకు పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు’అంటూ న్యాయమూర్తికి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కాగా, విజయవాడ జైల్లో ఉంటే వంశీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిన్న విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించిన సంగతి విదితమే. వంశీతో పాటు అతడి అనుచరులైన లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌లపై అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేయగా.. శివరామకృష్ణ ప్రసాద్‌, లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు. కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్‌ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు.

(The above story first appeared on LatestLY on Feb 14, 2025 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).