Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఫుల్ డిమాండ్.. రెట్టింపు కానున్న కోచ్‌లు.. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న రైలు.. 16 బోగీలతో నడపాలంటూ రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు.. మరో 10 రోజుల్లోనే అందుబాటులోకి అదనపు కోచ్‌లు
Vande Bharat Express (Photo-PTI)

Hyderabad, April 22: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad-Tirupati) మధ్య ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ (Vande Bharat Express) రైలుకు ముందుగా ఊహించినట్టుగానే ప్రయాణికుల (Passengers) నుంచి పెద్దయెత్తున డిమాండ్ (Demand) వస్తున్నది. ఈ రైలులో ప్రయాణించేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో టికెట్లు దొరకడం కూడా నానాటికీ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రైలులో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 8 కోచ్‌లతోనే ఈ రైలు నడుస్తుండగా వీటిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నారు.

Basava Jayanti 2023 Images & Basaveshwar Jayanti HD Wallpapers for Free Download Online: రేపే బసవ జయంతి.. బసవేశ్వర మహారాజ్ ఫోటోలు, హెచ్ డీ వాల్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి..

మరో పది రోజుల్లో..

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలులో ప్రస్తుతం 120-130 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. దీంతో చాలామంది ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను రెట్టింపు చేసి 16 కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఫలితంగా మరో 10 రోజుల్లోనే అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

CSK vs SRH Highlights: హైదరాబాద్‌ను వెంటాడుతున్న ఓటములు, సొంతగ్రౌండ్‌లో చెలరేగిన చెన్నై బౌలర్లు, బ్యాట్స్‌మెన్, ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం