MLC Elections In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీలో మే 31తో ముగ్గురి ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి, తెలంగాణలో ఆరుగురి ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3తో పూర్తి

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలను (MLC Elections In Telugu States) వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు (MLC elections postponed Due To Coronavirus ) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

MLC Elections In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీలో మే 31తో ముగ్గురి ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి, తెలంగాణలో ఆరుగురి ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3తో పూర్తి
Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Hyderabad, May 29: రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలను (MLC Elections In Telugu States) వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు (MLC elections postponed Due To Coronavirus ) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించాల్సిన ఎన్నికలను కూడా వాయిదా వేసినట్టు పేర్కొంది. ఈ మేరకు ఎస్ఈసీ (SEC) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జూన్‌ 30వ తేదీ వరకు కరోనా కట్టడికి సంబంధించి ఆంక్షలు అమలులో ఉంటాయని కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలో ఉన్న ఆంక్షలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఏపీలో మూడు మండలి స్థానాలకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. అదే విధంగా తెలంగాణలో 6 మండలి స్థానాలకు జూన్‌ 3తో గడువు ముగియనుంది. కరోనా పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

కృష్ణపట్నం మందుపై కొనసాగుతున్న సస్పెన్స్, అజ్ఞాతంలోకి వెళ్లిన ఆనందయ్య, నెల్లూరు కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్‌, సోమవారం విచారణ, మందుపై కేంద్ర అధ్యయన సంస్థ నివేదిక నేడు వచ్చే అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి చైర్మన్  అహ్మద్ షరీఫ్ (తెలుగుదేశం పార్టీ), దేవసాని చినన్ గోవింద్ రెడ్డి (వైయస్ఆర్ కాంగ్రెస్), సోము వీరరాజు (భారతీయ జనతా పార్టీ) ఈ ముగ్గురు ఎంఎల్‌సిల పదవీ కాతం మే 31 తో పూర్తి కానుంది. తెలంగాణలో, శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ గుతా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, అకుల లలిత మరియు బోడకుంటి వెంకటేశ్వర్లు (అందరూ తెలంగాణ రాష్ట్ర సమితి) పదవీ కాలం జూన్ 3తో ముగియనుంది. ఇక ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్ రెండూ అసెంబ్లీలలో అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యను కలిగి ఉన్నందున, కొత్త సభ్యులు ఎటువంటి పోటీ లేకుండా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

(The above story first appeared on LatestLY on May 29, 2021 01:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).