Accident in Yadadri: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మ‌ర‌ణం.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఓ కారు అదుపుత‌ప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

Accident in Yadadri: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మ‌ర‌ణం.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)
Car Accident (Credits: X)

Hyderabad, Dec 7: తెలంగాణ‌లోని (Telangana) యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. భూదాన్ పోచంప‌ల్లి జ‌లాల్‌ పూర్ వద్ద ఓ కారు అదుపుత‌ప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు చెరువులో మున‌గ‌డంతో అందులో ఉన్న ఆరుగురు యువ‌కుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక‌రు చెరువులోంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను వెలికితీశారు. అనంత‌రం మృత‌దేహాల‌ను భువ‌న‌గిరి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

తెలంగాణలో హోంగార్డుల దినసరి భత్యం రూ.921 నుంచి రూ.1000కి పెంపు, శుభవార్తను అందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Here's Video:

మృతులు హైదరాబాద్ వాసులు

హైద‌రాబాద్ నుంచి భూదాన్ పోచంప‌ల్లికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులోనే ఈ దుర్ఘటన జరిగినట్టు అనుమానిస్తున్నారు. మృతుల‌ను హైద‌రాబాద్‌ ఎల్బీ నగర్ లోని ఆర్టీసీ కాలనీకి చెందిన విన‌య్‌, హ‌ర్ష‌, బాలు, దినేశ్, వంశీగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో బయటపడిన మణికంఠ యాదవ్ అనే యువకుడు కారు అద్దాలు పగులగొట్టుకొని బయటకు వచ్చినట్టు సమాచారం.

తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం

(The above story first appeared on LatestLY on Dec 07, 2024 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).