COVID-19 in Telangana: తెలంగాణలో 15 జిల్లాలకు విస్తరించిన కరోనావైరస్ వ్యాప్తి, మరిన్ని జిల్లాల నుంచి కేసులు పెరిగే అవకాశం, 154కు చేరిన మొత్తం పాజిటివ్ కేసులు

నిజామాబాద్, నిర్మల్ మరియు భైంసా పట్టణాలు వైరస్ హాట్ స్పాట్ లుగా అధికారులు గుర్తించారు. నిర్మల్ జిల్లా నుంచి కనీసం 50 మంది వరకు నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు, 4 రోజులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు......

COVID-19 in Telangana: తెలంగాణలో 15 జిల్లాలకు విస్తరించిన కరోనావైరస్ వ్యాప్తి, మరిన్ని జిల్లాల నుంచి కేసులు పెరిగే అవకాశం, 154కు చేరిన మొత్తం పాజిటివ్ కేసులు
COVID 19 in Telangana. | Photo Credits: IANS)

Hyderabad, April 3: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ (COVID-19 in Telangana) చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తుంది. శుక్రవారం ఉదయం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరింది. గురువారం ఒక్కరోజే 27 కేసులు నమోదయ్యాయి, ఈ కేసుల సంఖ్య రాబోయే రెండు, మూడురోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గురువారం, కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రికి వచ్చిన రోగుల సంఖ్యతో ఈ రెండు ఆసుపత్రులు పూర్తిగా హౌజ్ ఫుల్ అయినట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు అన్ని కేసులు 'తభ్లిఘి జమాత్' మూలాలున్నవే అని తెలిసింది.

33 జిల్లాలున్న తెలంగాణలో ఇప్పటికే 15 జిల్లాలలో కోవిడ్-19 కేసులు నిర్ధారించబడ్డాయి. మరో 7 జిల్లాల నుంచి కరోనా అనుమానితుల రక్త నమూనాలు సేకరించారు, వీటి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మరియు కరీంనగర్ జిల్లాల నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.

గడిచిన 48 గంటల్లో 6 జిల్లాల నుంచి తొలి కేసులు నమోదయ్యాయి. ఇందులో సంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి 6 కేసులు చొప్పున నమోదు కాగా, కామారెడ్డి, ములుగు జిల్లాల నుంచి 2 చొప్పున మరియు సిద్ధిపేట, నిర్మల్ జిల్లాల నుంచి 1 కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించాలి- ప్రధాని మోదీ

నిజామాబాద్, నిర్మల్ మరియు భైంసా పట్టణాలు వైరస్ హాట్ స్పాట్ (Coronavirus Hotspots) లుగా అధికారులు గుర్తించారు. నిర్మల్ జిల్లా నుంచి కనీసం 50 మంది వరకు నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు, 4 రోజులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మల్ నుంచి కరోనావైరస్ సోకి మరణించిన వ్యక్తి ఖననం అధికారుల సమక్షంలో పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సూర్యాపేట, భువనగిరి-యాదాద్రి, జగిత్యాల, పెద్దపల్లి, వనపార్తి, మంచిర్యాల మరియు నారాయణపేట జిల్లాల నుంచి ఇంతవరకు ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు నిర్ధారించబడలేదు. ఇవి తప్ప మిగతా జిల్లాలన్నీ కరోనావైరస్ ద్వారా ప్రభావితమైనాయి.

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ఇప్పటివరకు 9 కరోనావైరస్ మరణాలు సంభవించాయి. అన్నీ కూడా తబ్లిఘి జమాత్ సమ్మేళనానికి హాజరైనవారివేనని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం కేసులలో 17 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, మిగాతా వారికి చికిత్స కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Apr 03, 2020 10:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).