Independence Day 2022: హైదరాబాద్లో ఉగ్రవాద దాడులపై తెలంగాణ పోలీసులను అలర్ట్ చేసిన ఐబీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసిన తెలంగాణ పోలీస్ శాఖ
ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఐబీ తెలంగాణ పోలీసులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు (Telangana police) అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా (Lashkar-e-Taiba), జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది
Hyd, August 10: ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఐబీ తెలంగాణ పోలీసులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు (Telangana police) అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా (Lashkar-e-Taiba), జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దేశ రాజధాని పాటు కీలక నగరాలను పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు (Central Intelligence Agency) హెచ్చరించాయి.
దీంతో హైదరాబాద్ (Hyderabad)లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport), రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలర్ట్ కొనసాగిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో 10వేలమందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలపై షూటర్లను మోహరించడంతో పాటు నో ఫ్లయింగ్ జోన్లు అమలు చేస్తున్నారు. గాలి పటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధం విధించగా.. నగరవ్యాప్తంగా వెయ్యికిపైగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి
భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 10, 2022 01:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

