
Hyderabad, Mar 3: హైదరాబాద్ లో (Hyderabad) ఇటీవలి కాలంలో కారు ప్రమాదాలు (Car Accidents) పెరిగిపోయాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాజాగా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ ఘాట్ ముందున్న డివైడర్ ను ఢీకొట్టిన ఓ కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసమయ్యాయి. అయితే, రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులోనే ఈ కారు ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసుల విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Video:
డివైడర్ ను ఢీ కొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు..
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం
రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసం
మద్యం మత్తులోనే ఈ కారు ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసుల విచారణ pic.twitter.com/ZcqcTnUsAO
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025
అత్తాపూర్ లో ఘోరం
హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ఆ చిన్నారి ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. అయితే, కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ కారణంగానే అంకిత చనిపోయినట్టు గుర్తించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.