Formula E Car Race Case: నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.. ఎందుకంటే??
ఫార్నులా ఈ-కారు రేసు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.
Hyderabad, Jan 8: ఫార్నులా ఈ-కారు రేసు (Formula E Car Race Case) కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పిటిషన్ వేయనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీకి ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ లో కోరనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి ఏసీబీ అధికారులు ఇప్పటికే నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో విచారణకు హాజరుకాకుండానే కేటీఆర్ ఓసారి వెనుదిరిగారు. దీంతో ఈ నెల 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ క్రమంలోనే విచారణకు తన లాయర్ ను కూడా అనుమతించాలని కేటీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు.
నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీకి డైరెక్షన్స్ ఇవ్వాలని కోరుకున్న కేటీఆర్
కేటీఆర్తో పాటు న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి నిరాకరించిన ఏసీబీ
ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేటీఆర్
ఈ… https://t.co/rDQTz9ij2Y pic.twitter.com/kmWjBLumlD
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2025
సుప్రీంకు కేటీఆర్
కాగా ఏసీబీ పిటిషన్ ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఏసీబీ, ఈడీ నోటీసులకు వ్యక్తిగతంగా హాజరై విచారణకు సహకరిస్తానంటున్న కేటీఆర్.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం గమనార్హం.
(The above story first appeared on LatestLY on Jan 08, 2025 08:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

