![](https://test1.latestly.com/uploads/images/2025/02/four-years-for-lv-prasad-eye-institute-at-siricilla.jpg?width=380&height=214)
Siricilla, Feb 9: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల(Siricilla) జిల్లాలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ని (KTR On LV Prasad Eye Insitute) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ఏర్పాటు చేసి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైద్య బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు కేటీఆర్.
కృష్ణ సింధూర ఐ సెంటర్ (ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్) డాక్టర్ జి.ఎన్. రావు , అలాగే హెటెరో ఫౌండేషన్ కు ఈ కేంద్రం ఏర్పాటు కావడానికి సహకరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. ఈ నాలుగేళ్లలో 87,000 కంటే ఎక్కువ అవుట్పేషెంట్ సేవలు, 6,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు (దాదాపు 45% ఉచితంగా) ప్రజలకు అందించిందన్నారు కేటీఆర్(KTR). హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో
గత కొన్ని సంవత్సరాలుగా, ఈ కేంద్రం కార్నియా & గ్లాకోమా ప్రత్యేక శస్త్రచికిత్సలు కూడా నిర్వహించిందన్నారు. 18,000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి అని చెప్పారు కేటీఆర్.
Four years for LV Prasad Eye Institute at Siricilla
The Krishna Sindhura Eye Centre (LV Prasad Eye Institute) in Siricilla, Rajanna Siricilla District, Telangana is celebrating its fourth anniversary today
I would like to thank Dr. G. N Rao of LVPEI and Hetero Foundation for making this happen 🙏
In these four years, the centre… pic.twitter.com/DBsrOHWU8u
— KTR (@KTRBRS) February 9, 2025
ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నిర్వాహకురాలు మనెమ్మ ఆర్, మమత ఎం (ఆప్తాల్మిక్ నర్సింగ్ అసిస్టెంట్), నిఖిల్ ఏ (విజన్ సెంటర్ కోఆర్డినేటర్), శ్రీకాంత్ పి (సెక్యూరిటీ), వెంకటేష్ ఎల్ (ఆప్టికల్స్) మరియు మిగతా బృందం సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పారు.ఇలాగే ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు కేటీఆర్.