High Security To Prateek Jain: లగచర్ల ఘటన నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రత.. 2+2 గన్ మెన్ కేటాయింపు.. పరారీలో ప్రధాన నిందితుడు
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు భద్రత పెంచింది. ప్రతీక్ జైన్ కు 2+2 గన్ మెన్ ను ప్రభుత్వం కేటాయించింది.
Vikarabad, Nov 17: వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని లగచర్ల ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు భద్రత పెంచింది. ప్రతీక్ జైన్ కు 2+2 గన్ మెన్ ను ప్రభుత్వం కేటాయించింది. ప్రతీక్ జైన్ పై దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ దాడి కేసులో రాఘవేందర్, మదరయ్య, బసప్ప, గోపాల్ అనే మరో నలుగురు అరెస్టు అయ్యారు. ఇప్పటి వరకూ 25 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మరికొంత మంది అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
పరారీలో ప్రధాన నిందితుడు
ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ ఇంకా పరారీలోనే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. సురేష్ ను హైదరాబాద్ లో దాచిపెట్టి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మణిపూర్ సీఎం నివాసంపై దాడి, మరోసారి రణరంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సురక్షితం
(The above story first appeared on LatestLY on Nov 17, 2024 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

