CM KCR Meets MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ, యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం, థర్డ్ ఫ్రంట్ పైనా ఇరువురు చర్చించినట్లుగా వార్తలు
Chennai, Dec 14: తమిళనాడులో కుటుంబ సమేతంగా పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. నేడు చెన్నై విచ్చేసిన కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కేసీఆర్ అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ స్టాలిన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్ను కేసీఆర్ కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
Here's TRS Party Tweet
చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్తో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. pic.twitter.com/JurF8pWa12
— TRS Party (@trspartyonline) December 14, 2021
అంతేకాదు ఈ భేటీలో థర్డ్ ఫ్రంట్ పైనా ఇరువురు చర్చించినట్టు సమాచారం. దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించినట్లుగా తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Dec 14, 2021 06:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

