COVID in TS:  వైరస్ సోకినా లక్షణాలు కనిపించడం లేవు! తెలంగాణలో మరో 2273 పాజిటివ్ కేసులు నమోదు, 1 లక్షా 62 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, వెయ్యికి చేరువైన కరోనా మరణాలు
Coronavirus Outbreak in India (Photo Credits: IANS)

Hyderabad, September 16:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 55,636 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,273  మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 883 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,76,222 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,62,844కి చేరుకుంది. అయితే, రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో అసలు లక్షణాలు లేని వారే అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల్లో 1,13,991 మందిలో ఎలాంటి లక్షణాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. కేవలం 30 శాతం మందికి మాత్రమే అంటే 48,853 బాధితులు మాత్రమే లక్షణాలు కలిగి ఉండటం గమనార్హం.

ఇక నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 325 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి నుంచి 185,  మేడ్చల్ నుంచి 164 కేసులు నిర్ధారణయ్యాయి.

వీటితో పాటు మరికొన్ని జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి. నిన్న  నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే   కరీంనగర్ నుంచి 122, వరంగల్ అర్బన్ నుంచి 114 కేసులు పాజిటివ్ అని తేలగా,  ఖమ్మం నుంచి 97, సిద్ధిపేట నుంచి 91  మరియు నిజామాబాద్ నుంచి 91 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:
Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 12 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 996 కు పెరిగింది.

అలాగే,  మంగళవారం సాయంత్రం వరకు మరో 2,260 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,31,447 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,401 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.