Telangana's COVID Report: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో 499 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 6,526 కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 198కి పెరిగిన కరోనా మరణాలు
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, June 19:  తెలంగాణలో శుక్రవారం భారీ స్థాయిలో  499  కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 6,526కు చేరుకుంది.

ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 329 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి.   ఆ తరువాత రంగారెడ్డి నుంచి కూడా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా 129 కేసులు నమోదయ్యాయి.  ఇక హైదరాబాద్ శివారులో ఉండే మేడ్చల్ జిల్లా నుంచి 4 కేసులు నమోదయ్యాయి.

మేడ్చల్ నుంచి 10,  మంచిర్యాల నుంచి 4, జనగాం, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి 3 చొప్పున, సంగారెడ్డి, భూపాలపల్లి,  మహబూబ్ నగర్ 4, నిజామాబాద్, మెదక్  జిల్లాల నుంచి 2 చొప్పున అలాగే మిగతా జిల్లాల కేసులను పరిశీలిస్తే, జనగాం 7, మహబూబ్ నగర్ 6, మంచిర్యాల, వరంగల్ అర్బన్, నల్గొండ మరియు నిజామాబాద్ జిల్లాల నుంచి 4 కేసుల చొప్పున నమోదు కాగా, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి 2 చొప్పున అలాగే సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ మరియు యాదాద్రి జిల్లాల నుంచి ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

శుక్రవారం మరో ముగ్గురు కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 198 కు పెరిగింది.

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇదిలా ఉంటే, ఈరోజు మరో 51 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,352 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,976 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో 2,477 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50,569 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.