Image of Gandhi Hospital, COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, December 21:  తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో పాటు కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేసులు తగ్గుతున్నాయి. అయితే వారాంతంలో నిర్వహించే టెస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుండంతో సోమవారం నమోదయ్యే కేసులు తక్కువగా ఉంటున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 32,714 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 316 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 554 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 64,75,766 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 281,730కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 86 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 30, మేడ్చల్ నుంచి 22, వరంగల్ అర్బన్ మరియు కరీంనగర్ జిల్లాల్లో చెరో 18 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,515కు పెరిగింది.

అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 612 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 273,625 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,590 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.