Hyderabad Shocker: వరుసకు అన్నాచెల్లెళ్లు, స్కూలుకు వెళుతూ ఆ పని కానిచ్చారు, బాలిక గర్భం దాల్చడంతో భయపడి బీహార్ నుంచి నగరానికి వచ్చేశారు
Representational Image | (Photo Credits: PTI)

Hyd, Sep 29: భాగ్య నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరుసకు అన్నా చెల్లెళ్లు అయ్యే ఆ ఇద్దరు దారి తప్పడంతో బాలిక గర్భం దాల్చింది. దీంతో భయపడి పారిపోయి వారు నగరానికి రాగా, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో దివ్యదశ చైల్డ్‌లైన్‌ కంట పడ్డారు. బిహార్‌లో పక్కపక్క ఇళ్లలో ఉండే బాలిక(15), బాలుడు(15) కలిసి చదువుకుంటున్నారు. ఆ చనువుతో ఇద్దరూ దగ్గరయ్యారు. వరుసకు అన్నా చెల్లెళ్లు కావడంతో కుటుంబ సభ్యులూ అనుమానించలేదు. అయితే బాలికకు 2 నెలలుగా రుతుక్రమం ఆగిపోవటంతో బాలుడికి చెప్పింది.

భార్యపై అనుమానంతో బెడ్ రూంలో కెమెరా, అది తెలియక ప్రియుడితో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆ తరువాత ట్విస్ట్ ఏంటంటే..

ఆసుపత్రికి తీసుకెళ్లగా ఏడు నెలల గర్భం అని చెప్పారు. తెలిస్తే ఊళ్లో గొడవ జరుగుతుందని ఆందోళనకు గురై ఈనెల 22న రైల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దివ్యదిశ చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు గుర్తించి ఆరా తీయటంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తొలుత బాలుడి కుటుంబసభ్యులు రావడంతో అతన్ని అప్పగించారు. ఆ తర్వాత వచ్చిన బాలిక కుటుంబ సభ్యులు జీఆర్పీలో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. కేసును బిహార్‌కు బదిలీ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.