![](https://test1.latestly.com/wp-content/uploads/2020/05/COVID-in-Telangana-380x214.jpg)
Hyderabad, December 1: తెలంగాణలో కరోనా ఉధృతి అదుపులో ఉంది, నిన్నటికంటే ఈరోజు కేసులు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 46,597 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 502 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 456 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 55,00,058 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 270,318కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 101 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 46, రంగారెడ్డి నుంచి 32, కొత్తగూడెం నుంచి 33 మరియు ఖమ్మం నుంచి 30 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/12/Ts1.jpg)
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/12/ts2.jpg)
మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,461కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 894 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 259,230 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,627 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.