Zomato Platform Fee Hiked: కస్టమర్లకు షాకిచ్చిన జొమాటో, ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి పెంపు
Zomato Logo (Photo Credits: Wikimedia Commons)

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తాజాగా కస్టమర్లకు మరోసారి షాకిచ్చింది. త‌న‌ ప్లాట్‌ఫారమ్ ఫీజును మ‌రోసారి 25 శాతానికి పెంచింది. దీంతో ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫారమ్ రుసుము రూ.5కి చేరింది. కాగా, గ‌తేడాది ఆగస్టులో రూ. 2 ప్లాట్‌ఫారమ్ రుసుమును ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు త‌న బిజినెస్‌ను లాభదాయకంగా న‌డ‌ప‌డానికి దానిని రూ. 3కి పెంచింది.

నూతన సంవత్సర సందర్భంగా రికార్డు స్థాయిలో ఫుడ్ ఆర్డర్‌లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జనవరిలో ప్లాట్‌ఫారమ్ రుసుమును రూ. 3 నుండి రూ. 4కి పెంచింది. ఇక కొత్త ప్లాట్‌ఫారమ్ పీజు జొమాటో గోల్డ్‌ సహా వినియోగదారులందరికీ వ‌ర్తించ‌నుంది. అటు కంపెనీ ఇంటర్-సిటీ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ను సస్పెండ్ చేసింది. భారత మార్కెట్లోకి అసుస్ జెన్ బుక్ డ్యూ, ధర రూ.1,59,990పై మాటే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

పెంపుదలలు జరుగుతున్నాయి. మేము త్వరలో మీకు స‌ర్వీస్‌ చేయడానికి తిరిగి వస్తాం. దయచేసి వేచి ఉండండి" అని జొమాటో యాప్‌లోని 'లెజెండ్స్' ట్యాబ్‌లో సందేశాన్ని పంపింది. కాగా గత వారం ఈ సంస్థ‌కు రూ. 11.81 కోట్ల వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) తో పాటు ఇత‌ర‌ పెనాల్టీలు ప‌డ్డాయి. ఇందులో జీఎస్‌టీ వాటా రూ. 5.9 కోట్లు ఉండ‌గా.. జులై 2017 నుంచి మార్చి 2021 కాలానికి గాను రూ. 5.9 కోట్ల పెనాల్టీలు ఉన్నాయి.