APPSC Group 1 Preliminary Results: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలను బోర్డు విడుదల చేసింది . ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలను బోర్డు విడుదల చేసింది . ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. ప్రిలిమనరీ పరీక్షలకు 88 వేల మంది నిరుద్యోగులు హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమనరీ ఫలితాలను ప్రకటించింది.
దాంతో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన గ్రూప్-1 మెయిన్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఫలితాలను psc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
(The above story first appeared on LatestLY on Jan 27, 2023 09:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

