Lockdown 4: రాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కేందుకు రెడీ అయినట్లేనా.., రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికులను గమ్యానికి చేర్చేందుకు లోకల్ స్పెషల్ బస్సులు, లాక్‌డౌన్ 4.0 కొత్త గైడ్‌లైన్స్ త్వరలో..
File image of passengers waiting for trains (Photo Credit: PTI)

New Delhi, May 15: దేశ వ్యాప్తంగా క‌రోనా‌వైర‌స్‌ను (Coronavirus) క‌ట్ట‌డి చేసే నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీ నుంచి నాలుగో ద‌శ లాక్‌డౌన్( Lockdown 4.0) అమ‌లు కానున్న‌ది. ఈ ద‌శ‌లో ఎటువంటి ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తారు, ఎక్క‌డెక్క‌డ స‌డ‌లింపులు ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైల్వే శాఖ రైళ్లను నడిపుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికులు ( train passengers) రైల్వే స్టేషన్ నుండి తమ గమ్య స్థానాలకు చేరాలంటే బస్సులు అనేది చాలా అవసరం. లాక్‌డౌన్‌కు ముందు తీసుకున్న టికెట్లు రద్దు, జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ, పూర్తి నగదు వాపస్

ఈ నేపథ్యంలో హోంశాఖ (MHA) రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేని సమయంలో స్టేషన్ల నుండి రైలు ప్రయాణికులను తీసుకెళ్లడానికి ప్రత్యేక బస్సులను నడుపుకోవడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం గురువారం అనుమతించింది.

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత పరిపాలనలకు రాసిన లేఖలో, కేంద్ర మరియు స్థానిక రవాణాపై విధించిన ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని రైలులో వచ్చే ప్రయాణీకులను తమ ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులను అనుమతించాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరినట్లు చెప్పారు.

MHA Order Allowing States to Run Special Buses From Railway Stations:

"పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రభుత్వాలు ప్రభుత్వ లేదా వ్యక్తిగత రవాణా అందుబాటులో లేని చోట రైల్వే స్టేషన్ల (Railway stations) నుండి ప్రత్యేక బస్సులను నిమగ్నం చేయడానికి అనుమతించబడతాయి, సరైన సామాజిక దూర ప్రమాణాలను పాటించాయి" అని హోం శాఖ తెలిపింది. హోంశాఖ జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ ప్రకారం, ధృవీకరించబడిన ఇ-టికెట్ల ఆధారంగా రైల్వే స్టేషన్ నుండి ఇంటికి ప్రయాణించేవారికి అనుమతి ఇవ్వబడిందని హోం కార్యదర్శి తెలిపారు. ఏపీలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్, పరిమిత సంఖ్యలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ఆన్‌లైన్ ద్వారానే టికెట్ల కొనుగోలు

ఈ పరిస్థితులు ఇలా ఉంటే నాలుగో ద‌శ లాక్‌డౌన్ కొత్త రూపంలో ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు హాట్‌స్పాట్ కాని జోన్ల‌లో లోక‌ల్ బ‌స్సులు న‌డిపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కేంద్ర‌ ప్ర‌భుత్వ వ‌ర్గాలు ద్వారా తెలుస్తున్న‌ది. ఆటోలు, ట్యాక్సీల‌ను కూడా ప్ర‌యాణికుల సంఖ్య‌ను కుదించి న‌డ‌పనున్నారు. నాన్ కంటేన్మెంట్ జోన్లు ఉన్న జిల్లాల్లో ఈ బ‌స్సు న‌డ‌వ‌నున్నాయి. అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌ను కూడా కేంద్రం ప‌చ్చ‌జెండా ఊపే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ట్రావెల్ పాసులు ఉన్న‌వారు మాత్ర‌మే మ‌రో రాష్ట్రానికి బ‌స్సు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.

దీంతోపాటుగా వ‌చ్చేవారం నుంచి దేశీయ విమాన స‌ర్వీసుల‌ను కూడా ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.కేవ‌లం నిత్యావ‌ర‌స వ‌స్తువులే కాదు, ఇక నుంచి అన్ని ర‌కాల వ‌స్తువులకు హోం డెలివ‌రీ అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అయితే వివిధ రాష్ట్రాల్లో వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ 12 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భుత్వాలు నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తున్న‌ది.

మెట్రో సర్వీసులు, లోకల్ రైళ్లు, దేశీయ విమానాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తిరిగి ప్రారంభించాలని కేరళ ఇప్పటికే కోరుకుంటోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. వలస కార్మికులు తిరిగి రావడం వల్ల క‌రోనా కేసులు పెరుగుతున్నందున బిహార్, జార్ఖండ్, ఒడిశాలో కఠినమైన లాక్‌డౌన్ కొనసాగాలని ఆలోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

కాగా మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధిక కేసులు న‌మోదవుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను మే 31 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. ఇక‌ లాక్‌డౌన్ 4.0కు సంబంధించిన నూత‌న‌ మార్గదర్శకాలపై కేంద్రం అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.